క‌రోనా దెబ్బ‌..కాంప్ర‌మైజ్ కి సెల‌బ్రిటీ పెళ్లికొడుకులు

Nithin and Shalini

టాలీవుడ్ హీరోలంద‌రూ స‌రిగ్గా క‌రోనా వైర‌స్ స‌మ‌యంలో త‌మ ప్రేమ వ్య‌వ‌హారాల గురించి రివీల్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. ముందుగా నితిన్, అటు పై నిఖిల్ .. ఆ త‌ర్వాత రానా ఇలా వ‌రుస పెట్టి అంద‌రూ ఇదే ఏడాది పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిపోవాల‌ని ఎంతో ఆశ‌ప‌డ్డారు. కానీ వాళ్లంద‌రి పెళ్లిళ్ల‌పై కరోనా కాటేసింది. మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో ముహూర్తం పెట్టిన పెళ్లిళ్లే ఆగిపోయాయి. ఇక అంగ‌రంగ వైభ‌వంగా అంతా చెప్పుకునేలా జ‌రిగే సెల‌బ్రిటీల పెళ్లిళ్లు అంత‌కు మించి ఇక్క‌ట్లు త‌ప్ప‌వ‌ని వెన‌క్కి త‌గ్గిపోయారు. నిఖిల్ జీవితానికొక పెళ్లి.. గ్రాండ్ గా చేసుకోవాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నాడు. ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జ‌రుగుతాయా? ఏంటి అని ఓ హీరో డైలాగ్ లా అయిపోయింది.

చివ‌రికి సింపుల్ గా రెండు కుటుంబాల స‌మ‌క్షంలో నిఖిల్ పెళ్లి ఘ‌ట్టం పూర్తిచేసేసాడు. ఇక నితిన్ ఏప్రిల్ 16న ముహూర్తం పెళ్లుకుని ఆగిపోయాడు. వైర‌స్ అదుపులోకి వ‌స్తే మ‌రో ముహ‌ర్తం చూసి కానిచ్చేయాల‌నుకున్నాడు. కానీ వైర‌స్ ప్ర‌భావం అంత‌కంత‌కు పెరుగుతుందే త‌ప్ప‌! త‌గ్గడం లేదు. దీంతో నితిన్ ఫ్యామిలీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అంద‌ర్నీ పిలిచి పెళ్లి చేసుకోవ‌డం ఏడాది జ‌రిగే ప‌ని కాద‌ని డిసైడ్ అయింది. దీంతో చివ‌రికి సింపుల్ గా హైద‌రాబాద్ లోని కుటుంబ స‌భ్యులు, ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన‌ట్లు అటు 50- ఇటు 50 మందిని పిలిచి పెళ్లి ఘ‌ట్టం పూర్తిచేయాలని డిసైడ్ అయిన‌ట్లు తెలిసింది.

శ్రావ‌ణ మాసం ఆరంభ‌మైన ఆగ‌స్టులో హైద‌రాబాద్ శివారులోని త‌మ ఫామ్ హౌస్ లో పెళ్లి చేసేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు అత్యంత స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఇక అదే నెల‌లో రానా వివాహం కూడా జ‌ర‌గ‌బోతుంద‌ని సురేష్ బాబు ముందే వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాదిక‌ల్లా క‌రోనాకి వ్యాక్సిన్ వ‌స్తే అప్పుడు చేసుకుందాం లే! అన్న ఆలోచ‌న‌ని విర‌మించుకుని సెల‌బ్రిటీలంతా ఇలా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.