తెలుగు టీవీ యాంకర్ పై కేసు, తాగి ఆమె ఏం చేసిందంటే..

తెలుగు టీవి యాంక‌ర్ ప్ర‌శాంతి పై ఉప్ప‌ల్ పోలీసులు కేసు న‌మోదు చేసారు. సంతోష్ ఉఫాద్యాయ్ అనే వ్య‌క్తితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఆమెపై కేసు న‌మోదైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్ చూసేందుకు.. యాంక‌ర్ ప్ర‌శాంతి త‌న స్నేహితులు పూర్ణిమ‌, ప్రియ‌, శ్రీకాంత్ రెడ్డి, సురేష్‌, వేణుగోపాల్ క‌లిసి త‌ప్ప‌తాగి వెళ్లారు. ఈ క్ర‌మంలో తొటి వీక్ష‌కుల‌కు ఇబ్బంది క‌లిగించారు. కార్పొరేట్‌ బాక్సు నెంబరు-ఎస్‌-22లో కూర్చున్న ప్రశాంతి, ఆమె స్నేహితులు ఇతరుల పట్ల అమర్యాదగా ప్రవర్తించారు.

ఫుల్లుగా మద్యం తాగి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ..అదే బాక్సులో కూర్చున్న భారత ఫైనాన్స్‌ సంస్థ ఉపాధ్యక్షుడు సంతోష్‌ ఉపాధ్యాయ్‌ (41)ను మ్యాచ్‌ చూడనివ్వకుండా విసిగించారు. ఆయన పోలీసుకు ఫిర్యాదు చేయడంతో టీవీ యాంకర్ ప్రశాంతి సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు.ముఖ్యంగా ప్ర‌శాంతి మ్మాయిని అన్న విష‌యం మ‌ర్చిపోయి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించింద‌ట‌.

దీంతో ఆగ్రహానికి లోనైనా సంతోష్ ప్ర‌శాంతి తోపాటు ఆమె స‌న్నేహితుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. సీసీ పుటేజీలు ప‌రిశీలించిన అనంత‌రం ఆధారాలు ఉండ‌టంతో పోలీసులు వాళ్లంద‌రిపై కేసులు న‌మోదు చేసారు. ప్ర‌శాంతికు వ్యాఖ్యాత‌గా ఆమెకు మంచి పేరుంది. సినిమా ఈవెంట్ల‌కు యాంక‌రింగ్ చేసింది. ప‌లు సీరియ‌ళ్ల‌లో కూడా ఆమె న‌టించింది.