ఆహుతి ప్రసాద్ కుమారుడు పై పోలీస్ కేసు

సెలబ్రెటీల కుటుంబ సభ్యులపై మీడియా కన్ను ఉంటుంది. వారిపై అప్పుడప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఆహుతి ప్రసాద్ కుమారుడు కార్తీక్ ప్రసాద్ పై పోలీస్ కేసు పెట్టారు. ఈ విషయమై మీడియాలో ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.

నటుడు ఆహుతి ప్రసాద్ కుమారుడు కార్తీక్ ప్రసాద్‌పై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఆర్కే సినీప్లెక్స్‌లో చిత్ర ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుండగా కార్తీక్ ప్రసాద్‌ లేచి నిలబడలేదు.

అక్కడున్న వారు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వవా అని అడగడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ బూతులతో వారిపై మండిపడ్డాడు. దీంతో కార్తీక్‌ ప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, క్యాన్సర్‌తో ఆహుతి ప్రసాద్ నాలుగేళ్ల కిందటే మరణించిన విషయం తెలిసిందే.