గీతా ఆర్ట్స్ లో బోయపాటి

గీతా ఆర్ట్స్ లో బోయపాటి

డైరెక్టర్ బోయపాటి శ్రీను నిరీక్షణ ఫలించింది . చాలా కలం నుంచి బోయపాటి సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు . ముందు బాలకృష్ణ తో సినిమా అనుకున్నారు . అది కార్యరూపం దాల్చలేదు . చిరంజీవితో చెయ్యబోతున్నాడు అనుకున్నారు . రామ్ చరణ్ నటించిన “వినయ విధేయ రామ “సినిమా ఫ్లాప్ తో .. అదీ అందకుండా పోయింది . ఆ తరువాత అఖిల్ తో సినిమా మొదలు కాబోతుందనే వార్తలు వచ్చాయి , కానీ ఆ సినిమా కూడా సెట్స్ మీదకు పోలేదు.

చాలాకాలంగా బోయపాటి సినిమా కోసం ఎదురు చూస్తూనేవున్నాడు . “వినయ విధేయ రామ ” తర్వాత “జయ జానకి నాయక ” సినిమా కూడా కూడా ఊహించని పరాజయంతో బోయపాటిని నిర్మాతలు పట్టించుకోవడం లేదనే వార్త వచ్చింది . కారణం బోయపాటి శ్రీను తన సినిమాకు అపరిమితమైన బడ్జెట్ చేస్తాడు . సినిమా విజయవంతం అయితే ఫర్వాలేదు , అదే పరాజయం పొందితే … ఆ నిర్మాత పరిస్థిటి ఊహించలేము .

అల్లు అర్జున్ తో గతంలో “సరైనోడు ‘సినిమా చేశాడు . ఆ సినిమా సైప్ర్ హిట్ అయ్యింది . ఈ కారణంతో అల్లు అరవింద్ బోయపాటితో సినిమా చేస్తున్నట్ట్టు ప్రకటన వచ్చింది . అల్లు అరవింద్ , బోయపాటి ఇద్దరు హైద్రాబాద్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నట్టు తెలిపారు . మొత్తానికి బోయపాటి … అల్లువారి సినిమా చెయ్యబోతున్నాడు .