బాపు బొమ్మ ఎనిమిద‌వ‌ వార్షికోత్సవ‌ సంబ‌రాలు

బాపు బొమ్మ అన‌గానే గుర్తుకొచ్చే క‌థానాయిక స్నేహ‌. త‌మిళ‌మ్మాయే అయినా తెలుగు ద‌నం నిండిన ఆహార్యంతో మ‌న లోగిళ్ల‌లో ఫాలోయింగ్ తెచ్చుకుంది. బాపు ద‌ర్శ‌క‌త్వంలో రాధా గోపాలం చిత్రంలో నటించి బాపు బొమ్మ అయ్యింది. ఆ త‌ర్వాత త‌మిళ హీరో ప్ర‌స‌న్న‌ను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.

తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్టార్ పెయిర్స్ లో ఒక‌రిగా స్నేహ – ప్రసన్న జంట నిలుస్తుంది. ఈ అందమైన జంట `అచాముండు అచముండు` చిత్రంలో స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు. ఆ స‌మ‌యంలోనే ప్రేమ‌లో ప‌డ్డారు. తరువాత 11 మే 2012 న వివాహం చేసుకున్నారు.

నిన్న ఈ జంట ఎనిమిదవ వివాహ వార్షికోత్సవం జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్నేహ -ప్రసన్న ఇద్దరూ ఇన్ స్టాగ్రామ్ లో త‌మ అంద‌మైన నాస్టాల్జిక్ జ్ఞాపకాలను ఫోటోల రూపంలో ఇన్ స్టాలో పంచుకున్నారు. ఎనిమిద‌వ వివాహ వార్షికోత్స‌వం జ‌రుపుకున్నాం. ఎప్ప‌టికీ మీ ఆశీస్సులు కావాలి! అని ప్ర‌స‌న్న ఇన్ స్టాలో కోరారు. ఇక స్నేహ అడ‌పా ద‌డ‌పా తెలుగులోనూ క్యారెక్ట‌ర్ న‌టిగా కొన‌సాగుతోంది. ప్ర‌స‌న్న కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తున్నారు. త‌మిళంలో బిజీ న‌టుడిగా కొన‌సాగుతున్నారు.