కన్న కూతురిని దారుణంగా హత్య చేసిన తండ్రి.. కారణం ఏమిటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రస్థుత కాలంలో చిన్న చిన్న విషయాలకు ఆగ్రహాం చెంది దారుణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలకు ప్రేమించిన వారి కోసం పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తల్లి తండ్రులు వారి పరువు పోయిందన్న కోపం తో కన్న పిల్లలు అని కనికరం లేకుండా హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అక్రమ సంబంధం పెట్టుకుందనే కారణంతో అల్లారు ముద్దుగా పెంచిన కూతురిని ఒక తండ్రీ దారుణంగా హత్య చేసిన ఘటన నంద్యాల లో కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే…నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరులో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆలుమురుకి చెందిన దేవేందర్ రెడ్డి తన కుమార్తె ప్రసన్న(21) ను రెండు సంవత్సరాల క్రితం బనగానపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే, కొన్ని రోజుల కిందట ప్రసన్న భర్తతో గొడవ పడి ఆలమూరులో ఉన్న తండ్రి దేవేందర్ రెడ్డి వద్దకు వచ్చారు. అయితే కొన్ని రోజుల తరువాత అదే గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి పారిపోయింది. అయితే వారిని వెతికి పట్టుకొని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి ఎవరి ఇంటికి వారిని పంపేశారు.

ఆ తరువాత కూతురిని భర్త దగ్గరికి వెళ్లాలని దేవేందర్ రెడ్డి కోరగా, ప్రసన్న అందుకు నిరాకరించింది. దాంతో ఆగ్రహానికి గురైన తండ్రి ఇంట్లోనే కూతురి గొంతు పిసికి చంపాడు. ఆ తరువాత మరికొంతమంది సహాయంతో మృతదేహాన్ని కారులో గిద్దలూరు ఘాట్‌కు తీసుకొని వెళ్లి తల, మొండెం వేరు చేసి లోయలో పదేసారు. మృతదేహం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా ప్రసన్న మృతదేహంగా గుర్తించారు. ఆ తరువాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా తండ్రి దేవేందర్ రెడ్డి హత్య చేసినట్లు నిర్దారణ అయ్యింది. దీంతో దేవేందర్ రెడ్డి తో పాటు ఆయనకి సహకరించిన మరికొందని పోలిసులు అరెస్ట్ చేశారు.