బండ్ల గ‌ణేష్ కి క‌రోనా..టాలీవుడ్ లో టెన్ష‌న్ టెన్ష‌న్!

తెలుగు రాష్ర్టాల్లో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. లాక్ డౌన్ స‌డ‌లింపు నేప‌థ్యంలో కేసులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది. దీంతో సిటీలో ఆంక్ష‌లు మ‌రింత క‌ఠినం అవుతున్నాయి. ఇప్ప‌టికే అక్క‌డి రాజ‌కీయ నాయ‌కుల‌కు క‌రోనా సెగ త‌గిలింది. కొంత మంది ఎమ్మెల్యేల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ ప్ర‌భావం టాలీవుడ్ పై ప‌డ‌లేదు. తాజాగా క‌రోనా అక్క‌డా అంటుకుంద‌ని తెలుస్తోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేష్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

గ‌ణేష్ హెయిర్ ప్లాంటేష‌న్ కోసం తెలిసిన డాక్ట‌ర్ ను సంప్ర‌దించ‌గా స‌ద‌రు డాక్ట‌ర్ ముందుగా గ‌ణేష్కు క‌రోనా ప‌రీక్ష‌లు చేసారుట‌. దీంతో ప‌రీక్ష‌లో పాజిటివ్ అని వ‌చ్చిందిట‌. మ‌రోసారి నిర్ధార‌ణ చేసుకుందామ‌ని వేరే ల్యాబ్ కు పంపించ‌గా అక్క‌డా పాజిటివ్ అని తేలిందిట‌. దీంతో గ‌ణేష్ కుటుంబ స‌భ్యులు స‌హా ఆయ‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన వారికి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు స‌మాచారం. అయితే కుటుంబంలో ఇంకెవ‌రికైనా పాజిటివ్ వచ్చిందా? లేదా? అన్న దానిపై స‌రైన క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం గ‌ణేష్ డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న‌ట్లు తెలిసింది. బండ్ల గ‌ణేష్ షాద్ న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి. కొన్ని రోజులుగా అక్క‌డ కేసులు పెరుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో గ‌ణేష్ కీ అంటుకుని ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే గ‌ణేష్ నిర్మాత కావ‌డంతో టాలీవుడ్ లోనూ క‌ల‌క‌లం మొద‌లైంది. రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పిన త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌న సినిమాల్లో బిజీ అయ్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కొద్ది రోజులుగా ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌కు రెగ్యుల‌ర్ గా ట‌చ్లో ఉన్న‌ట్లు తెలిసింది. మ‌రి లాక్ డౌన్ స‌మ‌యంలో గ‌ణేష్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి  బ‌య‌ట తిరిగారా? అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్న‌ట్లు స‌మాచారం. అదే జ‌రిగితే టాలీవుడ్ కి టెన్ష‌న్ త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం గణేష్ టాలీవుడ్ స‌హా ప్రేక్ష‌కుల్లో హాట్ టాపిక్ అవుతున్నారు.