కోర్ట్ కు హాజరైన బండ్ల గణేష్,కేసు వాయిదా

నటుడు, గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రాల , రాజకీయ నాయకుడు అయిన బండ్ల గణేశ్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. పట్టణానికి చెందిన 60 మంది నుంచి గణేశ్ పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించే క్రమంలో గణేశ్ ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయి.

దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులకు సంబంధించి గణేశ్ పలుమార్లు ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. తాజాగా, మంగళవారం కోర్టు వాయిదా ఉండడంతో ఆయన కోర్టుకు హాజరయ్యారు. కాగా, విచారణ అనంతరం కేసులను కోర్టు ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది.

ఇక గత కొంత కాలంగా సినిమాలను వదిలేసి పూర్తిగా వ్యాపారం చేసుకుంటూ ఉన్న బండ్ల గణేష్ మళ్లీ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మొదట నటుడిగా బండ్ల బాబు రీ ఎంట్రీ అన్నారు. మహేష్ బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరులో నటించబోతున్నాడు అన్నారు. ఇప్పుడు నిర్మాతగా బండ్ల రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు విషయాలపై క్లారిటీ అయితే లేదు.