‘సాహో’ సర్‌ప్రైజ్‌ పై అనుష్క కామెంట్‌

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమా నుంచి ఈరోజు ఓ కొత్త పోస్టర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి స్పందించారు.

పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ …‘ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అంశం.. ఆ తర్వాత ఏంటి? అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతిసారీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆగస్ట్‌ 15 కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నా. ప్రభాస్‌కు, యూవీ క్రియేషన్స్‌కు, సుజిత్‌కు, బృందంలోని ప్రతి టెక్నీషియన్‌కు ఆల్‌ ది బెస్ట్‌. ఎగ్జైటెడ్‌’ అని పేర్కొన్నారు.

సినిమా రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించటంతో పాటు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు. డిఫరెంట్ స్పెక్ట్స్‌తో సీరియస్‌ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ పోస్టర్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది.

రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

అనుష్క కెరీర్ విషయానికి వస్తే..యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన ‘భాగమతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క ఏడాది పాటు విరామం తీసుకుని తన తదుపరి సినిమాకు సైన్ చేసింది. ఆమె ప్రధాన పాత్రలో ‘సైలెన్స్‌’ చిత్రం తెరకెక్కుతోంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.