అనసూయ దెబ్బ “లైగర్” కి బాగా ప్లస్ అయ్యిందట..ఇదేలాగంటే.!

లేటెస్ట్ గా టాలీవుడ్ లో ట్రెండింగ్ గా లేదా హాట్ టాపిక్ గా ఒకే అంశం కోసం గట్టిగా నడుస్తుంది. కావాలని జరుగుతుందో లేక యాదృచ్చికంగా అవుతుందో కానీ ప్రముఖ యాంకర్ అనసూయ పేరే సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తూ వైరల్ అవుతుంది.

ఈ ఆగస్ట్ 25న పాన్ ఇండియా సినిమా దగ్గర బిగ్ డే. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కించిన భారీ చిత్రం “లైగర్” రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాకి టాక్ జస్ట్ డివైడ్ గా వచ్చింది అంతే దెబ్బకి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ ఆ సినిమాపై పడ్డాయి.

దీనితో అందరిలానే అనసూయ కూడా విజయ్ పై అప్పుడు అర్జున్ రెడ్డి కాంట్రవర్సీ ని గుర్తు చేస్తూ సంచలన పోస్ట్ పెట్టింది. దీనితో అక్కడ నుంచి ఆ టాపిక్ సినిమా నుంచి ఆమెని నెటిజన్స్ హెరాజ్ చేస్తున్నారని తనను ఆంటీ అంటున్నారని వేరే రకంగా మారిపోయింది.

ఇప్పటీకీ కూడా ఇదే అంశం పెద్ద ఎత్తున వైరల్ గా వినిపిస్తూ వస్తుంది. దీనితో అయితే ఇక అంతా లైగర్ నెగిటివ్ టాక్ అంతా పక్కకి వెళ్ళిపోయి అంతా అనసూయ – ఆంటీ ట్యాగ్ లపై పడ్డారు. ఆ రకంగా అయితే అనసూయ వల్ల సోషల్ మీడియాలో లైగర్ కి భారీ ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు.