ప్రభాస్ “ఆదిపురుష్” పై అభిమానులకి భారీ హింట్ ఇచ్చిన దర్శకుడు.!

పాన్ ఇండియా సినిమా దగ్గర ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి హీరో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “ఆదిపురుష్”. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో తెలుగు మరియు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించిన ఈ భారీ సినిమా మన పురాణాలూ ఆధారంగా తెరకెక్కించారు.

అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో కృతి సనన్ హీరోయిన్ గా సీతాగా కనిపించనుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో లంకేశునిగా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎన్నాళ్ళ నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దర్శకుడు ఓంరౌత్ అయితే ఈ అప్డేట్ ని విప్పాడు.

రీసెంట్ గా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ సంథింగ్ బిగ్ ఈ అక్టోబర్ లో వస్తుంది అని భారీ హింట్ అయితే ఇచ్చాడు. దీనితో అయితే ఆదిపురుష్ నుంచి అవైటెడ్ భారీ అప్డేట్ కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి. అయితే ప్రభాస్ బర్త్ డే కే ఆ ట్రీట్ ఉంటుందని సినీ ప్రముఖులు అంటున్నారు.

మరి దర్శకుడు ఇచ్చిన ఈ భారీ హింట్ తో అయితే ఈ అప్డేట్ అప్పుడే వస్తుందా ఇంకా ముందు వస్తుందా అనేది చూడాలి.