ఆమెను ఇబ్బంది పెట్టదంటూ… రానా బ్రదర్ కు చైతు వార్నింగ్

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్‌ ఆ మధ్యన శ్రీ రెడ్డి ఇష్యూతో వార్తలకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆ కుటుంబం ఆ విషయం పెద్దది కాకుండా సైలెన్స్ మెయింటైన్ చేసి,సర్దు మణిగేలా చేసారు. అయితే ఇప్పుడు ఓ నటి ఆయనపై చిన్న నటి అతని గురించి మరోసారి మాట్లాడింది. సౌమ్య జాను అనే పేరుగల ఆమె నాగచైతన్య తడాఖా సినిమాలో నటించింది. ఆమె రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఎలిగేషన్స్ చేసింది. తను హర్ట్ అయ్యానంటూ విషయం చెప్పింది.

తనకు అభిరామ్ పేరు వినటమే కాని..అతనెవరో తెలియదు అంటూ తడాఖా షూటింగ్ జరిగిన టైమ్ లోని ఓ సంఘటనను షేర్ చేసింది. రామానాయుడులో ఆమె షూటింగ్ లో ఉండగా ఓ రోజు..అభిరామ్ వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారని,తనకు హాయ్ చెప్పారని, తను కూడా జస్ట్ హాయ్ చెప్పానని, ఇండస్ట్రీకు కొత్త కావటంతో భయపడ్డానని, రామానాయుడు మనవడు అనగానే మరింత భయం కలిగిందని అన్నారు.

హాయ్ చెప్పి కారవాన్ లోకి వెళ్లిపోవటంతో ఆయన ఏం ఫీలయ్యాడో తెలియదు కానీ..నా కారుని రోడ్డు మీద పెట్టించేసారు. నేను ఏడ్చేసాను. నా అసెస్టెంట్ వెళ్లి మళ్ళీ ఆ కారుని పార్కింగ్ ప్లేస్ లో పెడితే..అలా ఎందుకు చేసావంటూ సీరియస్ అయ్యారు. వెంటనే నాగచైతన్య గారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పేసాను. ఓకే ఐవిల్ టాక్ టు హిమ్ అని..ఇమ్మిడియట్ గా అభిరామ్ ని పిలిచి..అభి..ఇది మనం చేస్తున్న సినిమా..నువ్వు మళ్లీ ఇలా చేయకు అంటూ వార్న్ చేసారు, ఆ తర్వాత నన్ను టచ్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చిందామె.