టాలీవుడ్ డైరెక్టర్స్ ని దూరం పెట్టిన అక్కినేని హీరోలు.. కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున కూడా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు పొందిన నాగార్జున ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా మరొకవైపు టీవీ షోలలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక అక్కినేని కుటుంబం నుండి నాగార్జున వారసులుగా అక్కినేని అఖిల్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వీరిద్దరూ కూడా హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ హీరోలుగా మంచి గుర్తింపు పొందారు.

అయితే ఇటీవల అక్కినేని హీరోలు ముగ్గురు వరుసగా ప్లాప్ లను ఎదుర్కొన్నారు. ది గోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాగార్జున ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఇక నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అక్కినేని హీరోల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఈ అక్కినేని హీరోలు ముగ్గురు ప్రస్తుతం తెలుగు దర్శకులను దూరం పెట్టినట్టు తెలుస్తోంది.

ది ఘోస్ట్ సినిమా తర్వాత నాగార్జున తమిళ దర్శకుడితో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గాడ్ ఫాదర్ సినిమా ద్వారా హిట్ అందుకున్న మోహనరాజా దర్శకత్వంలో నాగార్జున తదుపరి సినిమా రూపొందనుంది. ఇక థాంక్యూ సినిమా తర్వాత అక్కినేని నాగచైతన్య కూడా వెంకట ప్రభు అనే తమిళ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు. అలాగే అక్కినేని అఖిల్ కూడా తన తదుపరి సినిమాకి ఒక తమిళ దర్శకునికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా అక్కినేని హీరోలు ముగ్గురు ప్రస్తుతం తెలుగు దర్శకులను దూరం పెట్టి తమిళ దర్శకులతో సినిమాలు చేయటానికి సిద్ధమయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో తమిళ దర్శకులు మంచి హిట్స్ ఇవ్వటంతో ఇలా ముగ్గురు తమిళ దర్శకులకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.