ప్రభాస్ దగ్గరకు మల్టీ క్రోర్ యాడ్..డీల్, ఓకే చేస్తాడా

బాహుబలి చిత్రంతో బాహుబలి స్దాయి క్రేజ్ వచ్చింది ప్రభాస్ కు. దాంతో ఆయన చుట్టూ నిర్మాతలు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద కంపెనీలు తమ ప్రొడక్ట్స్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని ఆఫర్ చేస్తూ వెనక పడుతున్నాయి. అయితే ప్రభాస్ తన క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకోవటం లేదు. రోజు వారి టీవిల్లో కనపడాలనే ఆసక్తి చూపటం లేదు. దాంతో తన వద్దకు వచ్చిన బ్రాండ్ లకు సున్నితంగా నో చెప్పేస్తున్నాడు. అయితే ఓ మోటర్ బైక్ బ్రాండ్ వాళ్లు మాత్రం ప్రభాస్ ని వదలటం లేదని వినికిడి.

ఎలాగో ప్రస్తుతం ప్రబాస్ చేస్తున్న చిత్రం ‘సాహో’లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి..తమ బైక్ కు ప్రమోషన్ లో భాగం ఇవ్వమని అడుగుతున్నారట. ఈ మేరకు ప్రభాస్ తో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అటు సాహో ప్రమోషన్, ఇటు బైక్ ప్రమోషన్ రెండూ కలిసి వస్తాయని ప్రబాస్ కూడా మొగ్గు చూపుతున్నారట. అలాగే ఇందు నిమిత్తం ప్రభాస్ కు భారీ ఆఫరే ఇచ్చారని, మల్టీ క్రోర్ డీల్ ఇదని చెప్పుకుంటన్నారు. అయితే ఆ బైక్ ఏ కంపెనీది అని మాత్రం రివీల్ కావటం లేదు. త్వరలోనే ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది.

‘సాహో’విషయానికి వస్తే..

యంగ్ డైరక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సాహో’. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను 2019 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల చేసేందుకు దర్శక,నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన ఏమీ లేదు.

ఇక ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘యు.వి క్రియేషన్స్’ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి.