26వ‌ సినిమాపై మ‌హేష్‌కు పిచ్చ క్లారిటీ వుందే!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. రేపే ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోల సంద‌డి మొద‌లైంది. సినిమా ప‌క్కాగా బ్లాక్ బ‌స్ట‌ర్ గ్యారంటీ అని మ‌హేష్ ఫ్యాన్స్ ప‌క్కా కాన్ఫిడెంట్‌తో చెబుతుంటే మ‌హేష్ అంత‌కు మించిన కాన్ఫిడెంట్‌తో థియేట‌ర్లు ద‌ద్ధ‌రిల్లిపోవాలంతే అంటున్నారు. ఇదిలా వుంటే సూప‌ర్‌స్టార్ నెక్స్ట్ సినిమాపై చ‌ర్చ జ‌రుగుతోంది.

అయితే ఈ విష‌యంలో మాత్రం మ‌హేష్ పిచ్చ క్లారిటీతో వున్నార‌ట‌. బ‌య‌ట మాత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` త‌రువాత `అర్జున్‌రెడ్డి` ఫేమ్ సందీప్ వంగ‌తో కానీ, సుకుమార్‌తో కానీ లేదా మ‌ళ్లీ అనిల్ రావిపూడితో కానీ మ‌హేష్ సినిమా చేయోచ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా వుంటే మ‌హేష్ ఈ ముగ్గురితో కాకుండా వంశీ పైడిప‌ల్లితో త‌న త‌దుప‌రి సినిమా చేయ‌బోతున్నాడ‌ని తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త‌పై హీరో మ‌హేష్ క్లారిటీ ఇచ్చారు. త‌న త‌దుప‌రి చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లితో చేయ‌బోతున్న‌ట్టు స్పష్టం చేసేశారు. `స‌రిలేరు నీకెవ్వ‌రు` మీడియా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈ విష‌యాన్ని మ‌హేష్ వెల్ల‌డించారు.

మ‌హేష్‌కి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ‌స‌రం అనుకున్నటైమ్‌లో వంశీ పైడిప‌ల్లి `మ‌హ‌ర్షి`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ని అందించాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. అప్ప‌టి నుంచి వంశీ పైడిప‌ల్లి మ‌హేష్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయాడు. ఆ కార‌ణంగానే స‌రిలేరు నీకెవ్వ‌రు` త‌రువాత వంశీతోనే సినిమా చేయాల‌ని మ‌హేష్‌ ఫిక్స్ అయ్యిర‌ట. ఇదే విష‌యాన్ని తాజాగా బ‌య‌ట‌పెట్టారు. ఈ చిత్రంలో మ‌హేష్‌ని వంశీ పైడిప‌ల్లి ఓ గ్యాంగ్‌లీడ‌ర్‌గా చూపించ‌బోతున్నారట‌. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైనర్ ఇద‌ని తెలుస్తోంది.