`స‌రిలేరు..` ప్రాఫిట్‌లోకి వ‌చ్చేసిన‌ట్టే!

ఒక‌ప్పుడు సంక్రాంతి విజేత సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. ఆ టెగ‌స్సీని కంటిన్యూ చేస్తూ సంక్రాంతి హిట్ ఎప్ప‌టికీ మాదే అని మ‌రోసారి నిరూపించారు ప్రిన్స్ మ‌హేష్‌. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో అనిల్ సుంక‌ర‌, దిల్‌రాజుతో క‌లిసి వ‌న్ ఆఫ్ ది పార్ట్‌న‌ర్‌గా మ‌హేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలి ఆట నుంచే హిట్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా కూడా మంచి ఫిగ‌ర్‌ని సాధిస్తోంది.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని 77 కోట్ల‌కు అమ్మార‌ట‌. రెండు రాష్ట్రాల నుంచి తొలి రోజే ఈ చిత్రం 33 కోట్ల షేర్ వ‌సూలు చేయ‌డంతో భారీ మొత్తానికి తీసుకున్న బ‌య్య‌ర్స్ సంతోషాన్ని వ్య‌క్తం చేశారట‌. ఈ నెల 11న విడుద‌లైన ఈ చిత్రం వ‌రుస పండ‌గ సెల‌వులు కావ‌డం, రిపీటెడ్‌ ఆడియ‌న్స్ రావ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు రోజుల‌కు 77.94 కోట్ల మైలు రాయిన దాటింద‌ట‌.

దీంతో బ‌య్య‌ర్స్ సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయార‌ని తెలుస్తోంది. ఈ వీకెండ్ మ‌రింత జోరుని చూపించే అవ‌కాశం వుంద‌ని, వ‌సూళ్లు ఏ రేంజ్‌కి చేర‌తాయో అప్పుడే చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.