సందీప్ వంగా కొత్త చిత్రం ప్రకటన

సందీప్ వంగా నెక్ట్స్ అఫీషియల్ ఎనౌన్సమెంట్

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు పరిశ్రమ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన యంగ్ డైరక్టర్ సందీప్ వంగ . అదే సినిమాని రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడా అరుదైన సక్సెస్ అందుకున్నాడు. తెలుగులో కన్నా హిందీలోనే ఘన విజయం సాధించిందీ చిత్రం. అర్జున్ రెడ్డి రీమేక్.. కబీర్ సింగ్ ఊహించని విధంగా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి నిర్మాతలకు మంచి లాబాల్ని అందించటంతో అనేక మంది నిర్మాతలు, హీరోలు అతని వెనకపడ్డారు. కానీ మళ్ళీ ఆ నిర్మాతలతోనే సందీప్ మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రకటన వచ్చింది.

గత కొంత కాలంగా ఈ ప్రాజెక్టు విషయంపై పలు రకాల స్టోరీలు మీడియాలో వస్తున్నప్పటికి చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. చివరగా రీసెంట్ గా కబీర్ సింగ్ నిర్మాతలు భూషణ్ కుమార్ – మూరధ్ ఖేతని సందీప్ వంగని కలుసుకోవడంతో క్లారిటీ వచ్చింది. దాంతో వాళ్లు అఫిషీయల్ గా ఎనౌన్స్ చేసారు.

ఇక ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. క్రైమ్ డ్రామా తరహాలో సందీప్ తన తదుపరి ప్రాజెక్ట్ ని చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. టైటిల్ తో పాటు సినిమాలో నటీనటుల వివరాలను త్వరలో తెలియజేయనున్నారు. అలాగే ఈ సినిమాలో రణబీర్ కపూర్ నటించే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాపేరు డెవిల్ అని, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ అని చెప్తున్నారు.