‘వకీల్ సాబ్’తోనే సౌత్ ఎంట్రీ!?

ఎస్.. అవును.. ఇది నిజమే.  శ్రీదేవి కూతురు ‘వకీల్ సాబ్’తోనే సౌత్ ఎంట్రీ ఇవ్వనుందట. ఈ విషయాన్ని టాలీవుడ్ పెద్దలు చెప్పుకుంటున్నారు. అయితే..ముందుగా  సౌత్ మీద జాహ్నవికి అంత ఆసక్తి లేదనే వార్తలు కూడా వచ్చాయి. అలాంటిదేమీ లేదు.. ప్రస్తుతం బిజీగా ఉన్నందువల్లే జాహ్నవి దక్షిణాది వైపు దృష్టి పెట్టలేదని బోనీకపూర్ వివరణ ఇచ్చారు.
 
పూరి జగన్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమాలో ముందు జాహ్నవి కపూరే హీరోయిన్ అని అనుకున్నారు. కానీ అందుకు జాహ్నవి అంగీకరించలేదట. అయితే తాజాగా సమాచారం ప్రకారం శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ సౌత్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యే చిత్రం పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ అని తెలుస్తోంది.
 
‘పింక్’ రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న సోషల్ థ్రిల్లర్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన జాహ్నవి సౌత్ ఎంట్రీ ఇవ్వనుంది. ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను ‘వకీల్ సాబ్’ గా ఇక్కడ పవన్ కళ్యాణ్ చెయ్యడంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోనీకపూర్ కూడా ఓ నిర్మాత అనే విషయం తెలిసిందే.