రాజు గారి గది 3 నుంచి తప్పుకున్న తమన్నా

రాజు గారి గది సిరీస్ ఎంత విజయవంతం అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రెండో సీక్వెల్ గా రాజు గారి గది 3 కొద్దీ రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇలా అయిందో లేదో అప్పుడే హీరోయిన్ తమన్నా ఈ సినిమా నుండి తప్పుకుంది. కారణం ఏంటంటే, అసలు ముందు తన దగ్గరకు ఈ సినిమా వచ్చినప్పుడు తనకు చాలా నచ్చి ఈ సినిమా సంతకం చేసింది తమన్నా.

ఫైనల్ కాపీ ని తానూ సినిమా ప్రారంభం అయిన తరువాత మాత్రమే చూసిందట. తనకు ముందు చెప్పిన దానికీ ఇప్పటికీ స్క్రిప్ట్ లో చాలా మార్పులు ఉండడం, తన పాత్రలో కూడా చాలా వ్యత్యాసం ఉండడంతో అది నచ్చక సినిమా వదులుకుంది తమన్నా. ఏది ఏమైనా ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.