మెగా క్యాంప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌!

మెగా క్యాంప్‌కు కొత్త‌గా బ్రాండ్ అంబాసిడ‌ర్ వ‌చ్చేశాడు. అత‌ని క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాల‌నే మాస్ట‌ర్ మైండ్ అల్లు అర‌వింద్ అత‌న్ని త‌మ ఓటీటీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించుకున్నారన్న‌ది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ క్రేజీ హీరో ఎవ‌రో కాదు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పెళ్లిచూపులు` రిలీజ్ త‌రువాత `అర్జున్‌రెడ్డి` సినిమా రిలీజ్‌కి ముందు విజ‌య్ క్రేజ్‌ని గుర్తించి వ‌రుస‌గా త‌న చేత గీత గోవిందం, టాక్సీవాలా వంటి హిట్ చిత్రాల్ని చేయించి క్యాష్ చేసుకున్న అల్లు అర‌వింద్ మ‌ళ్లీ అలాంటి ప్లానే వేశాడు.

త‌ను కొత్త‌గా ఏర్పాటు చేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్ కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ప్ర‌చార క‌ర్త‌గా నియ‌మించి అత‌ని హోర్డింగ్స్‌ని రెండు రాష్ట్రాల్లోనూ నెట్టేశారు. దీంతో ప‌బ్లిసిటీకి ప‌బ్లిసిటీ డ‌బ్బుల‌కు డ‌బ్బులు ఇది అల్లు వారి ప్లాన్‌. శ‌నివారం `ఆహా`కు సంబంధించి తొలి ప్రెస్ కాన్ఫ‌రెన్స్ జ‌ర‌గ‌బోతోంది. ఇదే రోజు అధికారికంగా ఓటీటీ యాప్‌ని లాంచ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లోకి వ‌చ్చేసినా అధికారికంగా మాత్రం ఇంకా లాంచ్ చేయ‌లేదు. దీంతో విజ‌య్‌ని అడ్డుపెట్టుకుని భారీగానే యూత్‌ని బుట్ట‌లో వేయాల‌ని అల్లు అర‌వింద్ ప్లాన్‌కి ఇండ‌స్ట్రీ జ‌నాలు అవాక్క‌వుతున్నారు.