‘మీకు మాత్రమే చెప్తా’ ఫస్ట్ లుక్ విడుదల

దర్శకులు హీరోలు కావడం సహజమే కానీ తన దర్శకత్వంతో వెలుగులోకి వచ్చిన హీరో దర్శకుడిగా మారి ఆ దర్శకుడే ఈ హీరో నిర్మాణంలోని సినిమాలో హీరో అయితే? ఇది చాలా అరుదు కదూ. సరిగ్గా ఇలాంటి సంఘటనకు తెరలేపాడు హీరో విజయ్ దేవరకొండ.

పెళ్లి చూపులు సినిమాతో తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా తన సొంత నిర్మాణ సంస్థలో విజయ్ నిర్మిస్తోన్న సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. వీళ్లు ఈ చిత్ర టైటిల్ ప్రకటించిన విధానం చాలా నూతనంగా ఉంది. కథ కూడా అలాగే ఉంటుందని చెబుతున్నారు.

తరుణ్ భాస్కర్ తో పాటు అనసూయ భరద్వాజ్ మరో ప్రాముఖ్యత కలిగిన పాత్రలో నటిస్తుండటం విశేషం. విజయ్ దేవరకొండ తన కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది. త్వరలోనే విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

“మీకు మాత్రమే చెప్తా”లో తరుణ్ భాస్కర్ అబినవ్ గోమటం,అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రల్లో ఉండగా పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.