మహేష్ కొత్త సినిమా శాటిలైట్ రైట్లు సొంతం చేసుకున్న జెమినీ టీవీ

మహేష్ బాబు కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ’. ఈ సినిమా చిత్రీకరణ జులై 5 నుంచి మొదలు అవుతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా కీలక పాత్రల్లో రమ్య కృష్ణ, విజయ శాంతి నటిస్తున్నారు. విజయ శాంతి ఈ సినిమాతో తిరిగి సినిమాల్లోకి వస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ మొదలు కాకుండానే ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్లు రికార్డు ధరకు అమ్ముడు పోయాయి. వాటిని జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత కాగా అనిల్ సుంకర దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.