మళ్ళీ తెలుగు తెర పై హీరో సిద్ధార్ధ్

ఒకప్పుడు తన నోటి దురుసుతనంతో తెలుగు సినిమాలకు దూరం అయ్యాడు హీరో సిద్ధార్ధ్. అప్పట్లో తెలుగులో మంచి ఆదరణ కలిగిన హీరో సిద్ధార్ధ్. కానీ ఇప్పుడు తమిళ సినిమాలకే పరిమితం అయ్యాడు. అతను తెలుగులో ‘బాద్షాహ్’ (2013 ) లో అతిధి పాత్రలో కనిపించాడంతే.

ఇప్పుడు మళ్ళీ ఆరేళ్ళ విరామం తరువాత రవితేజ సినిమాతో తెలుగు తెర పై కనిపించనున్నాడు. ‘RX 100 ‘ సినిమా దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రవి తేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మహా సముద్రం’. ఈ సినిమాలో మరో హీరోగా సిద్ధార్ధ్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో అతని పాత్రను వినిపించగానే తెగ నచ్చి సినిమాకి సంతకం చేసేసాడట.

ఈ సినిమాలో రవి తేజ సరసన అదితి రావు హైదరి హీరోయిన్. ఇప్పుడు సిద్ధార్ధ్ జోడీగా నటించబోయే హీరోయిన్ ను ఎంచుకోవాల్సి ఉంది.