‘ఆడవార్లు మీకు జోహార్లు’ అంటున్న శర్వా

Aadavallu meku joharlu movie shooting begins

శర్వానంద్ ప్రస్తుతం ‘మహాసముద్రం’ మూవీని కంప్లీట్ చేసుకుని ‘ఒకే ఒక జీవితం’ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఈ హీరో గత చిత్రాలు బాక్సాఫీస్ ముందు ఫెయిల్ అవటంతో కొత్త మూవీస్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్ కిశోర్ తిరుమల కాంబినేషన్లో “ఆడవార్లు మీకు జోహార్లు ” మూవీ ఓకే చేసి చాలా కాలమే అయ్యింది. పలు కారణాలతో ఆలస్యమవుతూ ఉన్న ఈ మూవీ చిత్రీకరణ ఈ రోజు మొదలుపెట్టారు. ఈ సందర్బంగా షూటింగ్ స్పాట్ నుండి వర్కింగ్ స్టిల్ ను హీరో శర్వానంద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Aadavallu meku joharlu movie shooting begins

ఇందులో హీరో, హీరోయిన్, డైరెక్టర్, కెమెరామెన్ కలిసి రష్ ని చూస్తూ చిల్ అవుతున్నారు. ఈ మూవీలో రష్మిక మందన తొలిసారి శర్వానంద్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం హీరో హీరోయిన్ల కాంబినేషన్ షూటింగ్ ని ప్లాన్ చేశారట దర్శకుడు. గతంలో శర్వతో పడిపడి లేచే మనసు సినిమాను రూపొందించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ సారంగ్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు. మహాసముద్రం మూవీ అన్ని హంగులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.