నాని హీరోయిన్ కి పెళ్ళైందా ..ఇన్నేళ్ళుగా సీక్రెట్ దాచడానికి అదే కారణం ..? 

పక్కా హైదరాబాదీ అమ్మాయి అదితి రావ్ హైదరి. కానీ ఆమె ఎక్కువగా బాలీవుడ్ , కోలీవుడ్ సినిమాల్లోనే నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. 2006లో మమ్ముట్టి సరసన మలయాళం చిత్రం ప్రజాపతి తో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఆదితి. ఈ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన ఆమె ప్రేక్షకుల తోపాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక 2011లో సుధీర్ మిశ్రా దర్శకత్వంలో నటించిన యే సాలీ జిందగీ సినిమాతో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సినిమాలో అదితి నటనకు స్క్రీన్ పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటి పురస్కారం లభించింది.

Nani's 'V' releases romantic video of 'Manasu Maree Mathuga' song, here's  what it is about

బాలీవుడ్, కోలీవుడ్ మూవీస్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అదితి… సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరుణ్ తేజ్ తో అంతరిక్షం సినిమాలో నటించింది. ఇక ఇటీవల నాని తో జోడీ కట్టి వి సినిమాలో మెరిసి మైమరపించింది. ఇలా తెలుగు ఇండస్ట్రీలోనూ తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకుంటోంది అదితి హైదరి.

కాగా అదితి గత కొన్నేళుగా ఒక విషయాన్ని బయటపడకుండా సీక్రెట్ మేయింటైన్ చేసిందని సమాచారం. ఇన్నాళ్లు సింగిల్ అని భావించిన ఆదితికి పెళ్ళై ఎనిమిదేళ్లయిందట. 2009 లో బాలీవుడ్ నటుడు సత్య దీప్ మిశ్రాను అదితి పెళ్లి చేసుకుందని.. తెలుస్తోంది. పెళ్లి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన జ్ఞాపకం. కానీ ఈ విషయంలో మాత్రం అదితి కి మరిచిపోయే జ్ఞాపకంగా మిగిలింది. పెళ్ళైన మొదట్లో వీరిద్దరి దాంపత్యం బాగానే ఉన్నా ఆ తరువాత మనస్పర్థల తో విడిపోయారట. 2013లో భర్త నుంచి విడాకులు తీసుకున్న అనంతరం తన కెరీర్ పై దృష్టి పెట్టిందని తెలుస్తోంది.

ఆ తర్వాతే వరుసగా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో క్రేజ్ ను సంపాదించుకుంటూ… బిజీ హీరోయిన్ గా మారిపోయింది. జనరల్ గా హీరోయిన్లకు పెళ్లి అయ్యిందని తెలిస్తే సినిమా అవకాశాలు ఎక్కువగా రావని భావించే.. అదితి ఈ విషయాన్ని దాచి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారట. అయితే ఇది తన పర్సనల్ మేటర్ కాబట్టి దీని గురించి పెద్దగా డిస్కషన్ అవసరం లేదంటూ ఫాన్స్ అంటున్నారు.

ఇక ప్రస్తుతం సుధీర్ బాబు – ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాతో పాటుగా అజయ్ భూపతి – శర్వానంద్ కాంబినేషన్ లో వస్తున్న మహా సముద్రంలో కూడా అదితి హీరోయిన్ గా ఎంపికైంది. అంతేకాదు నాచురల్ స్టార్ నాని నటించబోతున్న శ్యామ్ సింగ్ రాయ్ లో మూడో హీరోయిన్ గా నటించబోతోందన్న వార్త కూడా ఇటీవలే వైరల్ గా మారింది.