బాహుబ‌లి – జ‌క్క‌న్న మ‌రో ప్ర‌యోగం!

`బాహుబ‌లి`… హీరోగా ప్ర‌భాస్‌ని, ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళిని ఇండియ‌న్ సినిమా శిఖ‌రాగ్రాన నిల‌బెట్టింది. ఈ సినిమా త‌రువాత ఈ ఇద్ద‌రు ఏం చేసినా అద్భుత‌మే అని యావ‌త్ దేశం మొత్తం ముక్త‌కంఠంతో ఆమోదించింది. `బాహుబ‌లి` సిరీస్‌ల‌తో దేశ వ్యాప్తంగానే కాకుండా వీరిద్ద‌రికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఏర్ప‌డింది. దీంతో వీరిద్ద‌రు క‌లిసి మ‌ళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారా? అది `బాహుబ‌లి`కి నెక్ట్ లెవెల్‌లో వుంటుందా? అని అంతా ఎదురు చూస్తున్నారు.

అయితే అందుకు భిన్న‌మైన దాని కోసం జ‌క్క‌న్న‌, ప్ర‌భాస్ చేతులు క‌లుపుతున్న‌ట్టు తెలిసింది. తాజాగా ఓ వార్త ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లతో `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న రాజ‌మౌళి ఈ సినిమా త‌రువాత డార్లింగ్ ప్ర‌భాస్‌తో క‌లిసి జాయింట్ వెంచ‌ర్‌గా ఓ బ్యాన‌ర్ ని స్టార్ట్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. దీని ద్వారా యువ ప్ర‌తిభావంతుల‌కు అవ‌కాశాలు క‌ల్పించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీనిపై ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని ఏర్పాటు చేసి అందులో కొత్త వారి చేత వెబ్ సిరీస్‌లు నిర్మించాల‌ని టాలెంట్ వుండి అవ‌కాశాల కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ఇండ‌స్ట్రి చుట్టు తిరుగుతున్న వారికి అవ‌కాశాల్ని క‌ల్పించాల‌ని భావిస్తున్నార‌ట‌.