బాలీవుడ్‌కు భారీ షాక్.. ఐసీయులో ఇర్ఫాన్‌!

బాలీవుడ్‌లో విల‌క్ష‌ణ న‌టుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు న‌టుడు ఇర్ఫాన్‌ఖాన్‌. గ‌త కొంత కాలంగా విచిత్ర‌మైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఈ మ‌ధ్యే కొంత కోలుకున్న‌ట్టు క‌నిపించారు. తాజాగా ఆయ‌న ఆరోగ్యం విష‌మించింద‌ని వార్త‌లు రావ‌డం బాలీవుడ్‌కు షాక్‌కు గురిచేస్తోంది. ఉన్న‌ట్టుండి ఆయ‌న ఆరోగ్యం క్షీణిచ‌డంతో ముంబైలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చేర్పించారు.

ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌య‌మంగానే వుంద‌ని ఇర్ఫాన్‌ఖాన్ వ్య‌క్త‌గ‌త సిబ్బంది వెల్ల‌డించారు. కొల‌న్ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా ఇర్ఫ‌న్ ఆరోగ్యం విష‌మించిన‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టించిన ఇర్ఫాన్‌కు 2018లో విచిత్ర‌మైన న్యూరో ఎండో క్రైమ్ ట్యూమ‌ర్ అనే వ్యాధి సోకిన‌ట్టు గుర్తించారు. చికిత్స కోసం ఇర్ఫాన్ లండ‌న్ వెళ్లి వ‌చ్చారు కూడా. ఏడాది పాటు అక్క‌డే గ‌డిపిన ఇర్ఫాన్ ఆ త‌రువాత ఇండియా వ‌చ్చి `అంగ్రేజీ మీడియం` సినిమాలో న‌టించారు.

మ‌రో సారి న్యూరో ఎండో క్రైమ్ ట్యూమ‌ర్ చికిత్స కోసం ఇర్ఫాన్ లండ‌న్ వెళ్లాల్సి వుంది. అంత‌లోనే ఆయ‌న ఆరోగ్యం క్షిణించ‌డంతో ప‌లువురు బాలీవుడ్ వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇర్ఫాని ప‌రీక్షించిన డాక్ల‌ర్లు మాత్రం ఇప్పుడే ఏమీ చెప్ప‌లేమ‌ని, అయితే ఆయ‌న‌ని ఎప్పిటిక‌ప్పుడు గ‌మ‌నిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఇటీవ‌ల ఇర్ఫాన్ త‌ల్లి జైపూర్‌లో మ‌ర‌ణించింది. లాక్‌డౌన్ కార‌ణంగా ఆమె అంత్య‌క్రియ‌ల్లో ఇర్ఫాన్ పాల్గొన‌లేక‌పోయాడు.