ప‌వ‌న్ – క్రిష్ సినిమాకు టైటిల్ ఫిక్స‌యిన‌ట్టేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చారు. జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీగా గ‌డిపేసిన ప‌వ‌న్ మ‌రోసారి అభిమానులు కోరిక మేర‌కు మ‌ళ్లీ ఫేస్‌కి మేక‌ప్ వేసుకున్నారు. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న చిత్రం `వ‌కీల్‌సాబ్‌`లో ప‌వ‌న్ న‌టిస్తున్నారు. ఇప్పటికూ దాదాపుగా పూర్త‌యింది. దీనితో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని కూడా ప‌వ‌న్ అంగీక‌రించారు.

ఈ సినిమా కూడా సైలెంట్‌గా షూటింగ్ జ‌రుపుకుంటోంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా కేంద్రం లాక్ డైన్‌ని విధించ‌డంతో తాత్కాలికంగా దీని షూటింగ్ ఆపేశారు. తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ‌ల సాయ‌న్న క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. మొఘ‌ల్ కాలం నాటి కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగుతుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రుగుతోంది.

దాదాపు 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్నినిర్మాత ఏ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్‌, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి `విరూపాక్షా` అనే టైటిల్ ప్ర‌చారంలో వుంది. తాజాగా ఈ టైటిల్‌నే ద‌ర్శ‌కుడు క్రిష్ ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు తెలిసింది. స్టోరీ ప్ర‌కారం ఈ చిత్రానికి `విరూపాక్ష‌` త‌ప్ప ద‌ర్శ‌కుడికి మ‌రో టైటిల్ క‌నిపించ‌డం లేద‌ట‌. దాంతో ఇదే టైటిల్‌ని ఫైన‌ల్ చేయాల‌నే ఉద్దేశ్యంతో ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత‌ ఏ.ఎం. ర‌త్నం ఫిక్స‌య్యార‌ట‌.