ప‌వ‌న్‌ సినిమాలో రేణుదేశాయ్ నిజ‌మెంత‌?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పీడు పెంచారు. మునుపెన్న‌డూ లేనంత‌గా య‌మ‌జోరుగా సినిమాలు చేస్తున్నారు. వ‌రుస‌గా వ‌న్ బై వ‌న్ లైన్‌లో పెట్టేస్తున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్‌ని మొద‌లుపెట్టిన ప‌వ‌న్ తాజాగా క్రిష్ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేసేశారు. ఈ రెండు చిత్రాలు ప్రారంభ ద‌శ‌లో వుండ‌గానే `గ‌బ్బ‌ర్‌సింగ్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన హ‌రీష్‌శంకర్‌తో మ‌రో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఈ మూడు చిత్రాల్లో ముందు మొద‌లైన పింక్ రీమేక్ షూటింగ్ జెట్ స్పీడుతో జ‌రుగుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన‌, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వార్త ఒక‌టి ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సినిమాలోని ఓ కీల‌క మ‌లుపులో ఓ పాప త‌ల్లిగా క‌నిపించే ఓ పాత్ర వుంద‌ట‌. ఆ పాత్ర‌ని రేణుదేశాయ్ చేత చేయిస్తే ఆ క్రేజ్ వేరేలా వుంటుంద‌ని దిల్ రాజు భావించి ప‌వ‌న్‌కు వివ‌రించాడ‌ట‌. ముందు ప‌వ‌న్ చూద్దాంలే అని అన్నా ఆ త‌రువాత పాత్ర కీల‌కం కావ‌డంతో స‌రే అన్నార‌ట‌. దీంతో ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ వేణుని రేణు దేశాయ్‌ని సంప్ర‌దించి లైన్ చెప్ప‌మ‌ని దిల్ రాజు కోర‌డం, క‌థ విని పాత్ర నిడివి త‌క్కువ‌గా వుంద‌ని, ఆలోచించి చెబుతాన‌ని రేణు దేశాయ్ చెప్పిన‌ట్టు వార్త‌లు షికారు చేస్తున్నాయి.

ఈ వార్త‌ల్లో కొంత నిజ‌ముంద‌ని, అయితే ఫ్యాన్స్ రియాక్ష‌న్‌ని బ‌ట్టి రేణూ దేశాయ్ నిర్ణ‌యం వుంటుంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.