పోయి పోయి పెద్దాయ‌న‌పై ప‌డ్డావేంటి అమ్మ‌డు?

పోయి పోయి పెద్దాయ‌న‌పై ప‌డ్డావేంటి అమ్మ‌డు?

హాట్ గాళ్ పూన‌మ్ కౌర్ టాలీవుడ్ ఖాళీగా ఉన్నా హైద‌రాబాద్ ని మాత్రం వ‌ద‌ల్లేదు. ఇక్క‌డే తిష్ట వేసి కాలా గుడుపుతోంది. వాస్త‌వానికి అమ్మ‌డు ఎప్పుడో పేడౌట్ అయిపోయింది. కానీ కొంద‌రు స్టార్ల‌ను..డైరెక్ట‌ర్ల‌ను అదే ప‌నిగా విమ‌ర్శిస్తు తెలుగు మీడియాకు ట‌చ్ లో ఉంటుంది. లేదంటే మీడియా ప‌ట్టించుకోద‌నే కొంద‌రి టాలీవుడ్ ప్ర‌ముఖుల్ని టార్గెట్ చేసింద‌ని అప్ప‌ట్లో కథ‌నాలు వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఫ‌లితంగా ఆ స్టార్ హీరో అభిమానుల‌తోనూ అంక్షిత‌లు వేయించుకుంది. అయినా అమ్మ‌డు తాను ప‌ట్టిన కుందేల్ కి మూడే కాళ్ల అన్న చందంగా ఇంక‌ను వ్య‌వ‌రిస్తోంది.

తాజాగా సీనియ‌ర్ న‌టుడు, ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత త‌నికెళ్ల భ‌ర‌ణిని మాత్రం అమ్మ‌డు ప్రేమ‌తో టార్గెట్ చేసింది. ఆయ‌న్న గొప్ప‌ద‌నాన్ని ఉద్దేశిస్తూ నిన్న ఓ క‌విత సోష‌ల్ మీడియాలోకి వ‌దిలిన సంగ‌తి తెలిసిందే. భ‌ర‌ణిలో ఔన్న‌త్యాన్ని…గొప్ప‌త‌నాన్ని చెబుతూ ఎంతోగొప్ప‌గా వ‌ర్ణించింది. తెలుగు భాష ర‌క‌పోయినా ఆ క‌విత ఎలా రాసిందో? అమ్మ‌డికే తెలియాలి. ఎవ‌రైనా రాసిచ్చింది..త‌న పేరుతో వ‌దులిందా? లేక తెలుగు నేర్చుకుని తానే రాసిందా? అన్న‌ది ఆ భ‌గ‌వంతుడికే ఎరుక‌. అయితే ఉన్న‌ట్లుండి భ‌ర‌ణి గురించి ఎందుకు రాసింది? అంత గొప్ప వ్య‌క్తులు టాలీవుడ్ లో ఇంకెరు లేరా? అని ఇలా ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్తం చేస్తోంది అమ్మ‌డి వ్య‌తిరేఖ వ‌ర్గం.పోయి పోయి పెద్దాయ‌న‌పై ప‌డింది! ఏంటి అంటూ ఫ‌న్ని కామెంట్ల‌తో నేటి జ‌నులు దాడి చేస్తున్నారు. మ‌రి ఆయ‌న్ని ఆవ‌హించి..ఆయ‌న ఆత్మ‌ను ప‌ట్టుకుని మ‌రీ క‌విత‌లో భావాలు క‌నిపించ‌డం కొత్త అనుమానాల‌కు తావిస్తోందిని అంటున్నారు.