నితిన్ , యేలేటి చిత్రానికి క్రేజీ టైటిల్

నితిన్ కొత్త చిత్రం టైటిల్ ఇంట్రస్టింగ్

ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు . ర‌కుల్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి చ‌ద‌రంగం అనే టైటిల్ పెట్టబోతున్నట్లు సమాచారం. అలాగని ఈ చిత్రం కథ చదరంగం చుట్టూ తిరగదట. అవ‌య‌వ‌దానంపై ఉంటుందట‌. మ‌నిషి చ‌నిపోయిన త‌ర్వాత ఆ అవ‌య‌వాల‌ను మ‌రొక‌రికి దానం చేస్తుంటారు. ఈ కాన్సెప్ట్‌కి క్రైమ్ , సస్పెన్స్ కలిపి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి ఏలేటి సినిమా చేస్తున్నాడ‌ట‌.

నిర్మాత మాట్లాడుతూ ‘‘నితిన్‌కి పక్కాగా సరిపోయే స్ర్కిప్ట్‌ కుదిరింది. ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది. చంద్రశేఖర్‌ యేలేటి అభిరుచి గల దర్శకుడు. మా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కొత్తగా ఉంటుంది. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. షూటింగ్‌ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్‌ శ్రీ వాస్తవ్‌, రచనా సహకారం, మాటలు: వెంకట్‌ నరేష్‌ రెడ్డి, కళ: వివేక్‌ అన్నామలై.

ఇదిలా ఉంటే నితిన్ తనతో ఛల్‌ మోహన్‌ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను ఓ సినిమా చేయ‌నున్నాడు. సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ బ్యానర్‌పై నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. 2020 వేసవిలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌కి ప‌వర్ పేట అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు టాక్. మ‌రోవైపు నితిన్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.