దసరాకి ప్రారంభం కానున్న నితిన్ ‘రంగ్ దే’

ప్రస్తుతం భీష్మ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. అందువల్ల నితిన్ తన తదుపరి చిత్రం ‘రంగ్ దే’ ను ప్రారంభించే పనిలో ఉన్నాడు. ఈ చిత్రానికి ‘తొలి ప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకుడు. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ చిత్రం తెరకెక్కనుంది. పీసి శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా, సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ చిత్రం రేపు విజయదశమికి లాంఛనంగా ప్రారంభం కానుంది. మరో వైపు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తో కూడా నితిన్ సినిమా చేస్తున్నాడు. చూద్దాం మరి ఈ సినిమాలు ఏ మేరకు నితిన్ కెరీర్ కు సహాయ పడతాయో.