త‌మ‌న్నా కూడా సాయి ప‌ల్ల‌విని అనుక‌రిస్తోంది!

మ‌ల‌ర్‌.. మ‌ల‌యాళ చిత్రం `ప్రేమ‌మ్‌` చూసిన‌వాళ్ల‌కి ఈ పేరు బాగా గుర్తుండిపోమింది. నేచుర‌ల్ మేక‌ప్‌తో మ‌ల‌ర్ పాత్ర‌లో అక్క‌డి వారిని మెస్మ‌రైజ్ చేసింది సాయిప‌ల్ల‌వి. ఆ త‌రువాత‌ శేఖ‌ర్ క‌మ్ముల రూపొందించిన `ఫిదా` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. భానుమ‌తి ఒక్క‌టే పీస్ రెండు కులాలు రెండు మ‌తాలు హైబ్రీడ్ పిల్ల అంటూ తెలంగాణ యాస‌లో మాయ చేసింది. తెలంగాణ‌తో పాటు ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్రేక్ష‌కుల మ‌న‌సుదోచుకుంది.

తాజాగా వేణు ఊడుగుల రూపొందిస్తున్న `విరాట‌ప‌ర్వం`లోనూ తెలంగాణ అమ్మాయిగా న‌టిస్తోంది సాయిప‌ల్ల‌వి. ఇదిలా వుంటే సాయిప‌ల్ల‌విని మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అనుస‌రిస్తోంది. ప్ర‌స్తుతం సంప‌త్‌నంద ద‌ర్శ‌క‌త్వంలో త‌మ‌న్నా `సీటీమార్‌` చిత్రంలో న‌టిస్తోంది. జ్వాలారెడ్డి పాత్ర‌లో మ‌హిళా జ‌ట్టుకి హాకీ కోచ్‌గా వ్య‌వ‌హరిస్తోంది. ఇందులో త‌మ‌న్నా ప‌క్కా తెలంగాణ యాస‌లో డైలాగ్‌లు చెప్ప‌బోతోంది. ఇందు కోసం భారీగానే క‌స‌ర‌త్తులు చేస్తోంద‌ని చెబుతున్నారు. నేటీవిటీకి త‌గ్గ‌ట్టుగా భాష‌పై ప‌ట్టు సాధించ‌డం కోసం ప్రాక్టీస్ చేస్తున్న‌ట్టు సీటీమార్ యూనిట్ ఇన్ సైడ్ టాక్‌.