తీవ్ర అస్వ‌స్త‌త‌లో… న‌టుడు సునీల్‌

టాలీవుడ్ లో క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన సునీల్ సినీ కెరియ‌ర్ గురించి తెలిసిన విష‌యం. హీరోగా స‌క్సెస్‌లు లేకపోవ‌డంతో తిరిగి మ‌ళ్ళీ క‌మెడియ‌న్‌గా మారారు. ఇటీవ‌లె త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అల‌వైకుంఠ‌ఫురంలో చిత్రంలో న‌టించిన స‌రైన గుర్తింపును అందుకోలేక‌పోయారు. గ‌త కొద్ది కాలంగా ఆయ‌న అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఆయ‌న గ‌చ్చిబౌలిలోని ఏషియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుప‌త్రిలో చేరారు. గ‌తంలోనూ ఆయ‌న ఓసారి యాక్సిడెంట్‌కి గుర‌య్యారు. అప్ప‌ట్లో కాలికి శ‌స్త్ర చికిత్స చేశారు. దాంతో కొన్ని రోజులు ఆయ‌న అప్ప‌ట్లో షూటింగ్‌ని కూడా వాయిదా వేశారు.

ప్ర‌స్తుతం ఆయ‌న రవితేజ హీరోగా వ‌స్తున్న‌ ‘డిస్కో రాజా’ చిత్రంలో ఓ కామెడీ పాత్ర‌ను పోషించారు. ఈ చిత్రం రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో హీరోగా మారిన విషయం విదితమే. తొలుత హీరోగా కెరియ‌ర్‌ని సాధించినా మంచి విజయాల్ని అందుకున్నారు సునీల్‌.

ఆ తరువాత ఎందుకోగాని పెద్ద‌గా స‌క్సెస్‌లు సాధించ‌లేక‌పోయారు. దీంతో ఆయ‌న తిరిగి క‌మెడియ‌న్‌గా మారి మళ్లీ హాస్య నటుడిగా అవతారమెత్తారు. అయితే హీరోగా, కమెడియన్‌గా ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు విలన్‌గా కొత్త అవతారం ఎత్తనున్నార‌ని స‌మాచారం. ‘కలర్ ఫోటో’ అనే సినిమాలో సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇక కేవ‌లం క‌మెడియ‌న్‌, హీరోగానే కాక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా ఆయ‌న‌కు మంచి పేరు ఉన్న విష‌యం తెలిసిందే. మ‌రి విల‌న్ గా ఏమేర‌కు మెప్పిస్తారో వేచి చూడాలి. ఈ చిత్రం ద్వారా నూత‌న ద‌ర్శ‌కుడు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. మ‌ధ్య‌లో చాలా గ్యాప్ వ‌చ్చిన ఆయ‌న‌కు త్రివిక్ర‌మ్ త‌న సినిమాల్లో అవ‌కాశ‌మిచ్చి రీ ఎంట్రీ ఇచ్చారు. వారిద్ద‌రి స్నేహం వ‌ల్లే తిరిగి ఆయ‌న సినిమాల్లోకి రావ‌డానికి అవ‌కాశం కలిగింది. ప్ర‌స్తుతం ఈ స్థితిలో ఉన్న సునీల్‌ను కొత్త సినిమాలో న‌టించ‌డానికి కాస్త స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.