డిజిటల్‌ రంగంలోకి ప్రియాంకా చోప్రా!

ఈ మధ్య కాలం సినిమా తన హద్దులు చెరిపేసుకుని ప్రేక్షకులకు చాలా దగ్గరైపోయింది. డిజిటల్ రంగం ద్వారా అక్కడ కూడా విపరీతమైన పోటీని ఎదుర్కుంటోంది. ఇక నెట్ఫ్లిక్ వంటి డిజిటల్ మాధ్యమాలు సినిమాలను ఏకంగా తమ మాధ్యమం కోసమే కూడా నిర్మించుకుంటున్నాయి. తాజాగా కొంత మంది నటీనటులు ఈ రంగం పై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆ కోవలోకి హిందీ నటి ప్రియాంక చోప్రా కూడా చేరుతుంది.

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌ వెళ్లిపోయినా హిందీ సినిమాల్లో కనిపిస్తూనే ఉంది. ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసింది. ఇప్పుడు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఒకటి కాదు ఏకంగా రెండు నెట్‌ఫ్లిక్స్‌ చిత్రాలను అంగీకరించింది. ఒకటేమో ‘వియ్‌ కెన్‌ బీ హీరోస్‌’. ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు. తాజాగా మరో నెట్‌ఫ్లిక్స్‌ చిత్రాన్ని ప్రకటించారు ఇక దాని వివరాలు తెలియాల్సి ఉంది.