కేవలం ఆరుగురితో ప్రభాస్ తదుపరి సినిమా ‘జాన్’

బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం తిరిగి కసరత్తులు మొదలు పెట్టాడు. ఈ సినిమాను రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే కథా నాయిక గా కనిపించనుంది. ఈ సినిమా గురించి కొంత ఆసక్తికరమైన సమాచారం బయటకి వచ్చింది.

పీరియడ్ డ్రామా గా యూరోప్ నేపధ్యంలో సాగనున్న ఈ చిత్రంలో కేవలం 6 పాత్రలు మాత్రమే ఉంటాయట. 1970 ల నేపధ్యంలోని యూరోప్ లో కధ సాగుతుందట. ఈ మేరకు స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు యూరోప్ సెట్లు హైదరాబాద్లో వేస్తున్నారట. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ పెట్టారు. చూద్దాం మరి బాహుబలి ప్రభాస్ ఈ సారి ఎలాంటి సినిమాతో మన ముందుకు వస్తున్నాడో.