కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ ఫస్ట్ లుక్

‘మ‌హాన‌టి’ సినిమాతో జాతీయ ఉత్తమనటి బహుమతిని సొంతం చేసుకున్న హీరోయిన్ కీర్తిసురేష్. ఆ సినిమా తరువాత తెలుగులో నటిస్తున్న చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజాగా యూరప్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు.

నిర్మాత మ‌హేష్ కోనేరు మాట్లాడుతూ – మ‌హాన‌టి చిత్రంతో కీర్తిసురేష్ తెలుగువారి హృద‌యాల్లో ఎంత‌టి స్థానం సంపాదించుకుందో తెలిసిందే. ఈ చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం. దాని లుక్‌ను విడుదల చేశాం. ఆమె నుండి ఇప్పుడు ప్రేక్షకులు ఎలాంటి సినిమా రావాలని కోరుకుంటారో
అలాంటి సినిమానే ‘మిస్ ఇండియా’. ప్ర‌తి అమ్మాయి త‌న జీవితంలో ఎక్క‌డో ఒక‌చోట ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొనే ఉంటుంది. మ‌హిళ‌లు సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు క‌నెక్ట్ అవుతుంది. సినిమా షూటింగ్ అధిక భాగం పూర్తయ్యింది. సినిమాను అక్టోబర్లేదా నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.