ఎవరు దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ సినిమా?

‘ఎవరు’ సినిమా చూసి మెచ్చుకొని వారు దాదాపుగా ఉండరు. అంతగా ఈ సినిమా అభిమానులను, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమాను ఎలాంటి వాణిజ్య హంగులతో చెడగొట్టకుండా పక్కాగా అనుకున్నది అనుకున్నట్టు తీసాడని దర్శకుడు వెంకట్ రాంజీ కి ప్రశంసలు దక్కాయి. అలాగే అవకాశాలు కూడా.

తాజాగా ఈ సినిమా చూసి హీరో సాయి ధరమ్ తేజ్ వెంకట్ ను కలిశారు. అతనితో సినిమా చేయాలనుంది ఆశ వ్యక్తం చేయగా అవతలి వైపు నుంచి కూడా సానుకూలంగా స్పందన వచ్చిందని వినికిడి. చూద్దాం మరి వీరిద్దరి కలయికలో సినిమా రానుందో లేదో.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ దర్శకుడు మారుతీతో ‘ప్రతీ రోజూ పండగే’ లో నటిస్తున్నాడు. ఈ సినిమాను గీత ఆర్ట్స్ మరియు యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తానికి ఈ యువ హీరో భవిష్యత్తు యువ దర్శకుల చేతుల్లో పెట్టాడన్న మాట.