ఎన్టీఆర్‌కు కేజీఎఫ్ డైరెక్ట‌ర్ క‌థ ఇదేన‌ట‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మైత్రి మూవీ మేక‌ర్స్ కలయికలో సినిమా ప్ర‌స్తుతం చర్చనీయాంశం. ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో మైత్రి నిర్మాతల్లో ఒక‌రైన న‌వీన్ ఎర్నేని ఈ చిత్రాన్ని ధృవీకరించారు. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు తార‌క్ కోసం క‌థ‌ను సిద్ధం చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. అయితే ఆ చిత్రం ఎలా ఉండబోతోంది?
అన్న ప్ర‌శ్న‌కు తాజాగా సమాచారం అందింది.

ప్ర‌స్తుతం కేజీఎఫ్ తదుపరి భాగాన్ని తెర‌కెక్కిస్తున్న ప్ర‌శాంత్ నీల్ త‌దుప‌రి సినిమా కథ పైనా దృష్టి సారించారు. తార‌క్ తో ఓ నృత్య ప్రధాన సినిమా చేయాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న అని తెలిసింది. తార‌క్ కి నృత్యాల్లో ఉన్న నైపుణ్యం గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. పరిశ్రమలో ఉత్తమ డ్యాన్స‌ర్ గా అత‌డికి పేరు ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత‌డి నృత్యాలకు ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ త‌ర‌హా కథను ఎంపిక చేసుకుంటున్నార‌ట‌.  ఈ ప్ర‌చారం నిజ‌మే అయితే తార‌క్ కెరీర్ లో ఓ ప్ర‌త్యేక‌మైన సినిమాగా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు.