ఇన్ స్టాలో సెల‌బ్రిటీల హంగామా!

వర‌ల్డ్ వైడ్‌గా క‌రోనా వైర‌స్ విల‌యాన్ని సృష్టిస్తున్న సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా అల‌ర్ట్‌ని ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 9 గంట‌ల వ‌ర‌కు 14 గంట‌ల పాటు జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌ధాని పిలుపుకు మ‌ద్ద‌తుగా సినీ తార‌లంతా ముందుకు వ‌చ్చారు. అంతే కాకుండా భార‌తీయులంతా దీనికి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని, స్వ‌చ్ఛందంగా రావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. జ‌న‌తా క‌ర్ఫ్యూ ని విజ‌య‌వంతం చేయ‌డంలో భాగంగా త‌మ వంతు బాధ్య‌త‌గా స్టార్స్ ఇన్ స్టాలో 14 గంట‌ల పాటు `మ‌నంద‌రి కోసం` అనే పేరుతో వినూత్న కార్య‌క్ర‌మానికి సిద్ధ‌మ‌య్యారు.

ఆదివారం ఉద‌యం 7గంట‌ల నుంచి రాత్రి 8:30 గంట‌ల వ‌ర‌కు మొత్తం 28 మంది తార‌లు ప్ర‌తీ అర‌గంట‌కు ఒక‌రు ఇన్ స్టా లైవ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టిస్తున్నారు. ఉద‌యం 7 గంట‌ల‌కు మంచు ల‌క్ష్మితో ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మం రాత్రి రానాతో ముగియ‌బోతోంది. 7 గంట‌ల‌కు మంచు ల‌క్ష్మి, 8 గంట‌ల‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, 9 గంట‌ల‌కు ఇషారెబ్బా, 9:30 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్‌, మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేష్‌, ఒంటి గంట‌కు స‌త్య‌దేవ్‌, సాయంత్రం 4 గంట‌ల‌కు నిహారిక‌, రాత్రి 7 గంట‌ల‌కు సుధీర్ బాబు, చివ‌ర‌గా రాత్రి 8:30 గంట‌ల‌కు రానా నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టించ‌నున్నారు.