ఆ వెలితిని స‌తీష్ వేగేశ్న తీర్చేశాడ‌ట‌!

నంద‌మూరి కల్యాణ్‌రామ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ల మ‌ధ్య మంచి అనుబంధం వుంది. ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్‌గా కంటే మించి స్నేహితుల్లా ఎప్పుడూ అన్యోన్యంగా క‌నిపిస్తుంటారు. ఇక గ‌త కొంత కాలంగా ఈ ఇద్ద‌రి బ్ర‌ద‌ర్స్‌లో ఎవ‌రి సినిమా రిలీజ్ వున్నా ఆ సినిమా ఫంక్ష‌న్‌ల‌కి మ‌రొక‌రు గెస్ట్‌గా వెళ్ల‌డం ఆన‌వాయితీగా మారింది. ముఖ్యంగా నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ చిత్రాల షంక్ష‌న్‌ల‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్న సినిమా ఫంక్ష‌న్‌లో త‌మ్ముడు హంగామా చేస్తుంటారు.

తాజాగా నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ న‌టిస్తున్న `ఎంత మంచి వాడ‌వురా!` ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌కి ముఖ్య అతిథిగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అన్న సినిమాల గురించి మాట్లాడుతూనే క‌ల్యాణ్‌రామ్ విష‌యంలో త‌న‌కొక వెలితి వుండిపోయింద‌ని, దాన్ని ఈ సినిమాతో వేగేశ్న తీర్చేశాడ‌ని స్ప‌ష్టం చేయ‌డం ఆక‌ట్టుకుంది. క‌ల్యాణ్‌రామ్ ఎన్నో వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించాడ‌ని, థ్రిల్ల‌ర్‌లు, క‌మ‌ర్శియ‌ల్ చిత్రాలు చేసినా ఆయ‌న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌లేద‌నే వెలితి వుండేది. అది ఈ సినిమాతో తీరిపోయిందని అన్నారు.

ఈ సంక్రాంతి పండ‌గ వాతావ‌ర‌ణంలో విడుద‌ల‌వుతున్న ద‌ర్బార్‌, స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో, మా `ఎంత మంచి వాడ‌వురా`.. ఈ చిత్రాల‌న్నీ అద్భుత‌మైన విజ‌యాల్ని సాధించి తెలుగు చిత్ర సీమ ముందుకు వెళ్లేలా దోహ‌ద‌ప‌డాల‌ని మ‌న‌స్ఫూర్త‌గా కోరుకుంటున్నాను అని అన్నారు ఎన్టీఆర్‌.