అమెరికా సెక్స్ రాకెట్ గురించి రెజీనా ఏమందంటే….

కాస్టింగ్ కౌచ్ అంశం తర్వాత అమెరికా సెక్స్ రాకెట్ వివాదం టాలీవుడ్ ని కుదిపేసింది అని చెప్పొచ్చు. ఈ సెక్స్ రాకెట్ లో ఎంతోమంది తారల పేర్లు బయటకు వచ్చాయి. ఐతే కొందరు నటులు స్పందించగా కొందరు పట్టించుకోలేదు. తాజాగా రెజీనా ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు. ఒకోసారి రియాక్ట్ అవకపోవటమే మంచి రియాక్షన్. నామీద వచ్చిన వదంతుల్లో నిజం ఉంటే ఇప్పటికే ఏదొక యాక్షన్ తీసుకునేవారు. కానీ వాటిల్లో నిజం లేదు కాబట్టే అటువంటిది జరగలేదు. అది అబద్దం అని తెలిసినప్పుడు పబ్లిసిటీ కోసం రియాక్ట్ అవడం అందుకు. ఇప్పుడు నేను స్పందిస్తే దానిపై మళ్ళీ ఎవరో ఒకరు ఏదోకటి అంటారు అంతే కానీ దానికి సొల్యూషన్ రాదు. సొల్యూషన్ దొరకదు అనుకున్నప్పుడు స్పందించడం ఎందుకు? రియాక్ట్ అవాల్సిన టైం వచ్చినపుడు నేను తప్పకుండా మాట్లాడతాను అని చెప్పింది.

ప్రజలు ఏమనుకుంటున్నారో అదే మాట్లాడతారు. వారికి నిజాలతో పని లేదు. కానీ మీడియావాళ్లు మాత్రం వాస్తవం తెలుసుకుని న్యూస్ ప్రెసెంట్ చేయాలి. తప్పుడు సమాచారాన్ని పబ్లిష్ చేయకూడదు. ఎందుకంటే ప్రజలు మీడియాని ఫాలో అవుతారు. ఒక జర్నలిస్ట్ ఏదైనా చెప్తే కొంతమంది నమ్ముతారు. అందుకే మీడియా వారు ఇలాంటివి ప్రచారం చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి అని మనవి చేసింది రెజీనా. మనం చేస్తున్న పనిలో నిజాయితీ ఉన్నప్పుడు ఇంక వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని తెలిపింది. సినిమా పరిశ్రమలోనే ఇలాంటివి జరగట్లేదు. ప్రతిచోటా ఇలాంటివి ఉన్నాయి. కార్పొరేట్ సంస్థల్లో ఇవి ఉన్నప్పటికీ బయటకి తెలియవు. కాకపోతే మేము తెర మీద కనిపిస్తాము కాబట్టి అందరూ మమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఇలాంటివాటికి స్పందించడం వలన సమస్యలు పెద్దవి అవుతాయి తప్ప సొల్యూషన్ ఉండదు అని చెప్పుకొచ్చింది. ‘అ’ మూవీ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు రెజినా. ప్రస్తుతం ఈ భామ మూడు తమిళ సినిమాలు, ఒక హిందీ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం.