అనుపమ పర్ఫెక్ట్ చాయిస్!?

‘అఆ’ సినిమాలో నాగవల్లి పాత్రతో తెలుగు ఆడియన్స్ అప్లాజ్ అందుకున్న బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. ఈమధ్య వచ్చిన రాక్షసుడు రీమేక్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు జోడీగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తోనూ ఆకట్టుకుంది. ప్రేమమ్, శతమానంభవతి, హలోగురూ ప్రేమకోసమేలాంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి బాగా కనెక్టైంది . తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో అవకాశాలతో తెలుగు తెరకు కొంత దూరమైనా నిఖిల్ సినిమాతో మళ్లీ తెలుగు ఆడియన్స్‌ని పలకరించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో మలయాళ ప్రాజెక్టులో బిజీగావున్న అనుపమ త్వరలో సెట్స్‌పైకి రానున్న కార్తికేయ -2 ప్రాజెక్టుకి చందు మొండేటి మైండ్‌లో ఏకైక ఛాయిస్‌గా ఉందట. కెరీర్ గ్రాఫ్ కిందకు దిగిపోవడంతో కార్తికేయ 2ని సెట్స్‌పైకి తెచ్చేందుకు నిఖిల్ కంగారు పడుతున్నాడు. ‘సవ్యసాచి’ ఫెయిల్యూర్‌తో మళ్లీ తనను తను నిరూపించుకునే కసితో ఉన్నాడు చందూ మొండేటి. ఆ కసితోనే కార్తికేయ 2 కథను గ్రిప్పింగ్‌గా సిద్ధం చేశాడట. ఈ డివోషనల్ థ్రిల్లర్‌లో నిఖిల్‌కు జోడీగా అనుపమ దాదాపుగా ఖరారైందనే అంటున్నారు. కథానాయిక పాత్ర అందం, అమాయకత్వం కలగలిపినట్టు చందు డిజైన్ చేయటంతో ఆ పాత్రకు అనుపమ పర్ఫెక్ట్ చాయిస్ అన్న భావనలో ఉన్నారు