‘అఆ’ సినిమాలో నాగవల్లి పాత్రతో తెలుగు ఆడియన్స్ అప్లాజ్ అందుకున్న బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. ఈమధ్య వచ్చిన రాక్షసుడు రీమేక్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు జోడీగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తోనూ ఆకట్టుకుంది. ప్రేమమ్, శతమానంభవతి, హలోగురూ ప్రేమకోసమేలాంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్టైంది . తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో అవకాశాలతో తెలుగు తెరకు కొంత దూరమైనా నిఖిల్ సినిమాతో మళ్లీ తెలుగు ఆడియన్స్ని పలకరించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్తో మలయాళ ప్రాజెక్టులో బిజీగావున్న అనుపమ త్వరలో సెట్స్పైకి రానున్న కార్తికేయ -2 ప్రాజెక్టుకి చందు మొండేటి మైండ్లో ఏకైక ఛాయిస్గా ఉందట. కెరీర్ గ్రాఫ్ కిందకు దిగిపోవడంతో కార్తికేయ 2ని సెట్స్పైకి తెచ్చేందుకు నిఖిల్ కంగారు పడుతున్నాడు. ‘సవ్యసాచి’ ఫెయిల్యూర్తో మళ్లీ తనను తను నిరూపించుకునే కసితో ఉన్నాడు చందూ మొండేటి. ఆ కసితోనే కార్తికేయ 2 కథను గ్రిప్పింగ్గా సిద్ధం చేశాడట. ఈ డివోషనల్ థ్రిల్లర్లో నిఖిల్కు జోడీగా అనుపమ దాదాపుగా ఖరారైందనే అంటున్నారు. కథానాయిక పాత్ర అందం, అమాయకత్వం కలగలిపినట్టు చందు డిజైన్ చేయటంతో ఆ పాత్రకు అనుపమ పర్ఫెక్ట్ చాయిస్ అన్న భావనలో ఉన్నారు