అడవుల్లో పని చేయనని చెప్పిన రాశి ఖన్నా

ప్రస్తుతం గ్లామర్ హీరోయిన్ గా కుర్ర హీరోల సరసన సినిమాలు చేస్తున్న హీరోయిన్ రాశి ఖన్నా. ఈమె ‘తొలిప్రేమ’ చిత్రంతో తన ప్రతిభను నిరూపించుకుంది. వరుస అవకాశాలతో తీరిక లేకుండా ఉంది.
ఈ క్రమంలో ఆమెకు ఒక పెద్ద నిర్మాణ సంస్థ నుంచి ఒక అవకాశం వచ్చింది. గోపీచంద్ హీరోగా దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం తీసే సినిమాలో ఆమెను కధానాయికగా సంప్రదించారు.

మొదట సరే అన్న రాశికి కధలో భాగంగా ఆమె 40 – 50 రోజులు అడవిలో ఉండాల్సి వస్తుంది అని తెలిసింది. ఈ విషయం తెలియగానే ఆమె సినిమా నుంచి తప్పుకుంది. అంత రిస్క్ ఎందుకు అనుకుందో మరి ఆమె లెక్కలు ఎలా ఉన్నాయో తెలీదు కానీ ప్రస్తుతం ఆ బృందం మరో హీరోయిన్ ను వెతుక్కునే పనిలో పడ్డారు.