అఖిల్ తో ‘అ’ దర్శకుడి థ్రిల్లర్ సినిమా

అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ ఇంకా తెలుగు పరిశ్రమలో స్థానం సంపాదించడానికి కష్టపడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక ప్రేమ కధా చిత్రం చేస్తున్నాడు. తన తదుపరి సినిమా ఈ సారి ఒక థ్రిల్లర్ కానున్నది. లవర్ బాయ్ ఇమేజ్ తో అటువంటి సినిమాలే చేసుకుంటున్న అఖిల్ దారి మార్చిన దర్శకుడు ఎవరో కాదు ‘అ’ దర్శకుడు ప్రశాంత్ వర్మ.

ఇతను చెప్పిన కధకు ఓకే చెప్పేసాడు అఖిల్. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం నివేద థామస్ ను సంప్రదించారట. మరి ఈ దర్శకుడు ప్లాప్ల లో ఉన్న తన కెరీర్ కి అఖిల్ కెరీర్ ని మార్చగలడో లేదో వేచి చూద్దాం