నిర్మాత సురేష్ బాబు మద్రాస్ లో పుట్టి పెరిగాడు . ఆయనకు గ్రామా జీవితం పెద్దగా తెలియదు . ఎప్పుడైనా తన తండ్రి రామ నాయుడుతో పాటు కారం చేడు వెళ్లి రావడం తప్ప , అక్కడ వున్న సందర్భాలు లేవు . ఆయన విద్యాబ్యాసం అంతా మద్రాస్ లోనే సాగింది . తండ్రి హైదరాబాద్ రావడంతో ఆయన తో పాటు వచ్చి నిర్మాణ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాడు . సోదరుడు దగ్గుబాటి వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజా సినిమాతో తండ్రి ప్రమేయం లేకుండా చిత్రాలు నిర్మించడం మొదలు పెట్టాడు . విజయవంతమైన నిర్మాత గా ఎదిగాడు
సినిమా నిర్మాణంతో పాటు , ఫిలిం డిస్ట్రిబ్యూషన్, థియేటర్లు , స్టూడియో , కంప్యూటర్ గ్రాఫిక్స్, ఫిలిం స్కూల్ లాంటి అనేక వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాడు . గ్రామాల గురించి మాట్లాడుతూ – “దశాబ్దాలుగా ప్రభుత్వాలు వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు . ఎంతసేపటికీ పట్టణాలపైనే ద్రుష్టి పెడుతున్నారు . కనీస సౌకార్యాలు కూడా ఉండటం లేదు . అందుకే గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు వస్తున్నారు . గ్రామాల్లో స్వేచ్ఛగా బ్రతికే వారు సిటీలకు వచ్చి ఇరుకు గదుల్లో , చాలాఈ చాలని జీతాలతో బ్రతుకు తున్నారు . నిజానికి వారు గ్రామాల్లో ఎంతో సుఖ సంతోషాలతో వుంటారు .
గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి, సరైన వైద్య, విద్యా సదుపాయాలు , స్వచ్ఛమైన త్రాగు నీరు , వ్యవసాయానికి చేయూత , పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తే మనం బ్రతిమలాడినా గ్రామాలు వదిలి సిటీ కి రారు .
ఎప్పుడో గాంధీజీ గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని చెప్పాడు . ఆ మాటలు ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు ” అన్నాడు. అలాగే మనిషి ఆరోగ్యంగా బ్రతక టానికి ఆర్గానిక్ పంటలు చాలా అవసరమని సరే బాబు చెప్పాడు . కేవలం మాటలకే పరిమితమా కాకుండా ఆర్గానిక్ పంటలను పండిస్తున్నాడు .
