కొడంగల్ లో టిఆర్ఎస్ ప్రచార రథంపై దాడి (వీడియోలు)

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల పర్వానికి తెర లేచినవేళ కొడంగల్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం, ఖాజీపూర్ గ్రామంలో టిఆర్ఎస్ తరుపున ప్రచారం చేస్తున్న వాహనంపై గ్రామస్తులు దాడి చేశారు. వాహనంపై ఉన్న కేసిఆర్, స్థానిక అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఫ్లెక్సీలను చింపి పడేశారు. 

మళ్లీ గ్రామంలోకి ప్రచారానికి వస్తే సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ సమయంలో ఖాజీపూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామస్తుల చర్యతో ప్రచార రథాన్ని అక్కడి నుంచి తరలించాడు డ్రైవర్. అయితే ఈ దాడి ఎందుకు జరిగింది? కారణాలేమిటో తెలియరాలేదు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం తమ గ్రామంలో ప్రచారం చేయవద్దని చెప్పినా వినకుండా ప్రచార రథం తీసుకొచ్చి గ్రామంలో తిప్పుతున్నారని అందుకే గ్రామస్థులంతా ఏకమై ప్రచార రథంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో కాంగ్రెస్, టిడిపి నేతలు ఎవరైనా ఉన్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

గ్రామస్తులు ప్రచార రథంపై దాడి చేసిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

Kodangal

 

Kodangal