ఈయన తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి ముఖ్యమైన నాయకుడే. దేశ ప్రజలంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మునిగిపోయారు. అన్ని ఆఫీసుల్లో, కంపెనీలలో, సంస్థల్లో జాతీయ జెండాలు ఎగురవేసి సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ టిఆర్ఎస్ లీడర్ కూడా జెండా ఆవిష్కరణ చేసి మంచి పట్టు సాధించాలని డిసైడ్ అయిండు. అంతే వెంటనే జెండా కర్ర, జెండా, చాక్లెట్లు, పూలు తీసుకొచ్చిండు. పక్కనే ఉన్న స్కూల్ పోరగాళ్లను కూడా పట్టుకొచ్చిర్రు. ఇంకేముంది ఈ లీడర్ సాబ్ జెండా ఎగుర వేసిండు.
కాకపోతే ఈ లీడర్ సాబ్ జాతీయ జెండా బదులు గులాబీ జెండా ఎగుర వేసిండు. పాపం పసి పోరగాళ్లకు ఏం తెలుసు. జెండా ఎగిరి పూలు కింద పడంగనే జన గన మన గేయం పాడిర్రు. ఈ లీడర్ సాబ్ అందరిలాగా జాతీయ జెండా ఎగురవేస్తే ఏం బాగుంటదని వెరైటీ గా ఇట్ల ట్రై చేసిండేమోనని జనాలు మాట్లాడుకుంటున్నారు.
ఈ ఘటన అంధోల్ నియోజకవర్గంలో జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. గులాబీ జెండా ఆవిష్కరించిన వీడియో కింద ఉంది చూడండి.
