శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇవ్వలేదని సెల్ టవరెక్కిన యువకులు (వీడియో)

 

హైదరాబాద్ వనస్థలిపురంలో ఉద్రిక్తత ఏర్పడింది. తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ కేటాయించాలంటూ శ్రీకాంతాచారి అభిమానులు ఇద్దరు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. చింతలకుంటలోని సెల్ టవర్ ఎక్కి నినాదాలు చేశారు. మరికొంత మంది విజయవాడ హైవేపై బైఠాయించారు. శంకరమ్మకు టికెట్ కేటాయించాలని లేకపోతే తాము సెల్ టవర్ నుంచి దూకుతామని వారు బెదిరించారు. జోహార్లు శ్రీకాంతాచారి అంటూ నినదించారు. శంకరమ్మ అనుచరులు సెల్ టవర్ ఎక్కిన వీడియో కింద ఉంది చూడండి.

 

రెండో జాబితాలోనైనా శంకరమ్మకు టికెట్ కేటాయించాలని లేకపోతే తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు. అమరుల త్యాగ ఫలితంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వారిని మరిచిన టిఆర్ ఎస పార్టీకి తగిన బుద్ది చెప్పక తప్పదని వారు హెచ్చరించారు. కేసీఆర్ అమరుల కుటుంబాలను అవమాన పరిచారని వారు విమర్శించారు. యువకుల ఆందోళన తో చింతలకుంటలో ఉద్రిక్తత ఏర్పడింది.