బ్రేకింగ్ న్యూస్ : తెలంగాణ మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

తెలంగాణ అటవీ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. మంచిర్యాల జిల్లాలో ఎయిమ్స్ అనే ప్రయివేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సోమవారం జోగు రామన్న పాల్గొన్నారు. ప్రారంభోత్సవం చేసేందుకు మూడో ఫ్లోర్ వెళ్లాలని లిఫ్ట్ ఎక్కారు. అయితే లిఫ్ట్ ఎక్కగానే కొద్ది ఎత్తులోకి వెళ్లగా లిఫ్ట్ కేబుల్ తెగి కింద పడిపోయారు. మొదటి ఫ్లోర్ కి కూడా వెళ్లకముందే కొద్ది ఎత్తులోకి వెళ్లగానే కేబుల్ తెగింది. అయితే మరింత ఎత్తులోకి వెళ్లిన తర్వాత తీగ తెగిపోతే ప్రమాదం జరిగేది. 

కొద్ది ఎత్తులోనే జరిగిన ఘటనలో మంత్రి జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది.  ఈ ప్రమాదంలో జోగు రామన్నతోపాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై మంచిర్యాల పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.